ధోనికి కూడా కోపం వస్తుందట.. !


నేను అందరిలాంటి వాడినే. నాకు కోపం వస్తుంది అన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఎలాంటి పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలను కనపడనీయకుండా, ప్రశాంతంగా ఉండడం ధోని లక్షణం. దీంతో ధోని అసలు కోపమే రాదని అనుకొంటారు. కానీ,’నేను అందరిలాంటి వాడినే.కానీ చాలా మంది వ్యక్తుల కంటే మెరుగ్గా నేను నా భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకుంటా’నని ధోని అన్నారు.

‘అందరిలాగే నేనూ అసహనానికి గురవుతా. కొన్ని సార్లూ నాకూ కోపమొస్తుంది, నిరాశ కలుగుతుంది. ఆ భావోద్వేగాల కన్నా అప్పుడు ఏం చేయాలన్నదే ముఖ్యం. తర్వాత ఏం చేయాలి? ఏ ఆటగాణ్ని ఉపయోగించుకోవచ్చు? అని ఆలోచిస్తా. ఓ నిర్ణయానికి వచ్చాక భావోద్వేగాలను బాగా నియంత్రించుకోగలుగుతా’నని ధోని చెప్పుకొచ్చాడు.