రిలయన్స్ సరికొత్త రికార్డ్

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) సరికొత్త రికార్డ్ సాధించింది. బాంబే స్టాక్‌ మార్కెట్లో శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో కంపెనీ మార్కెట్‌ విలువ ఓ దశలో రూ.9,01,490 కోట్ల రూపాయలుగా నమోదైంది. దీంతో రూ.9 లక్షల కోట్ల మార్కెట్‌ విలువను అందుకున్న తొలి భారతీయ సంస్థగా ఆర్‌ఐఎల్‌ అవతరించింది.

కంపెనీల మార్కెట్‌ విలువ సూచీ స్టాక్‌ మార్కెట్‌ ధరల ఆధారంగా ప్రతిరోజు మారుతూ ఉంటుంది. 2018 ఆగస్టులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.8లక్షల కోట్ల మార్కెట్‌ విలువను సాధించింది. జులై-సెప్టెంబరు త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ భారీ వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.