బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

తెలంగాణ కాంగ్రెస్ నేడు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా కారణాలతో దృష్ట్యా బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేశారు.

మరోవైపు, కాంగ్రెస్ నేతల ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌ ముఖ్య నేతలను పోలీసులు అరెస్టులు, హౌస్‌ అరెస్ట్‌ లు చేస్తున్నారు. ప్రగతిభవన్‌ను ముట్టడించేందుకు బయల్దేరుతున్న కాంగ్రెస్‌ నేతలను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులు హౌస్‌ అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, షబ్బీర్‌అలీని పోలీసులు పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలంగాణ కాంగ్రెస్‌ నేడు ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.