మరో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా 


మూడో టెస్టులో భారత బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఆదివారం తొలి రెండు ఓవర్లలోనే ఒపెనర్స్ వికెట్స్ కోల్పోయిన దక్షిణాఫికా.. ఈ ఉదయం ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే మరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 10.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి, 41 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇంకా 456 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లలో ఉమేష్ 2 వికెట్లు తీయగా, షమీ 1 వికెట్ పడగొట్టాడు. 

ఇక భారత్ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శర్మ 212, రెహానే 155 అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో తొలి ఇన్నింగ్స్ లో భారత్ 497/9 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.