మహేష్ దీపావళి ట్రీట్ రెడీ !

సంక్రాంతి సినిమాలు దసరా కానుకలు అందజేశాయి. ఇప్పుడు దీపావళికి ట్రీట్ ఇవ్వబోతున్నాయ్. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ చిత్రం ‘అల.. వైకుంఠపురంలో’. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి దీపావళి ట్రీట్ గా రెండో సాంగ్ ‘రాములో రాములా..’ సాంగ్ రాబోతుంది. దీనికి సంబంధించిన టీజర్ ఇవాళే రానుంది. ఇక మరో సంక్రాంతి సినిమా సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు దీపావళికి ట్రీట్ రెడీ చేస్తున్నారు.

ఈ విషయాన్ని తెలుపుతూ దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్ చేశారు. సరిలేరు నీకెవ్వరు దీపావళి ట్రీట్ కి రెడీగా ఉండండి అంటూ.. చందరంగంలో కింగ్ నిలబడి ఉన్న ఫోటోని పోస్ట్ చేశారు. అంతేకాదు.. విలన్ హౌస్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే చివరి షెడ్యూల్ ప్రారంభం కానుందని ట్విట్ చేశారు. సంక్రాంతికి సూపర్ ఫన్ అందించబోతున్నట్టు తెలిపారు. 

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా రష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అనిల్ సుంకర్-దిల్ రాజు-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.