సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

సింగరేణి కార్మికులకి తీపి కబురు. దీపావళికి బోనస్‌ అందుకోనున్నారు. సింగరేణిలో దీపావళికి ముందు కార్మికులకు బోనస్‌ చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. జాతీయ బొగ్గు గని కార్మికుల వేతన ఒప్పందం (ఎన్సీడబ్ల్యూఏ) పది ప్రకారం 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను కార్మికుల పనితీరు ఆధారంగా పెర్ఫార్మెన్స్ లింక్డు రివార్డు స్కీం పేరుతో ఈ దీపావళి బోనస్ చెల్లింపునకు సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. గత యేడాది కార్మికులకు రూ.60,500 చొప్పున బొనస్ చెల్లించారు. ఈ యేడాది దాన్ని  64,700కి పెంచారు. ఈ నెల 25న కార్మికులకు బోనస్ అందించించనున్నారు. దీపావళి బోనస్‌ ప్రకటనతో సింగరేణి కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.