మహేష్ సినిమా మళ్లీ చిక్కులు

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేసిన ఏం లాభం లేదని నిర్మాతలు వాపోతున్నారు. దీనికి కారణం మహేష్ సినిమాకి ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు నిర్మాతలు ఉండటమే. అందులోనూ.. నాన్ థియేట్రికల్ హక్కులని మహేష్ ఖాతాలోకే పోతాయ్. నిర్మాతలకి మిగిలింది థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చినది మాత్రమే. ఈ నేపథ్యంలో మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా నిర్మాతలకి నష్టాలు తప్పలేదు. ఈ సినిమాకు దిల్ రాజు,పివిపి, మహేష్ నిర్మాతలుగా వ్యవహరించారు.

ముందుగా మహర్షి సినిమాని దిల్ రాజు-మహేష్ నిర్మాతలుగా ప్లాన్ చేశారు. కానీ, బ్రహ్మోత్సవం బ్యాలెన్స్ తో పివిపి వచ్చి చేరారు. ఐతే, మహర్షి సినిమా పివిపికి ఏం మిగలలేదట. ఇప్పుడు పివిపి మహేశ్ మరో సినిమానికి నిర్మాతగా మారనున్నాడు. మహర్షి తర్వాత మహేష్-వంశీపైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వంశీతోనే మహేష్ సినిమా ఉండనుంది.

ఈ సినిమాకు గానూ పివిపి యాభై శాంతం నిర్మాతగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా బ్రహ్మోత్సవం బ్యాలెన్స్ లో భాగమే అంటున్నారు. ముగ్గురు నిర్మాతలు కావడంతో మహర్షి అవుట్ పుట్ దెబ్బతిన్నది అనే కామెంట్స్ వినిపించాయ్. ఇప్పుడు మహేష్ -వంశీ కాంబోలో రెండో చిత్రానికి ఇలాంటి చిక్కులు తప్పేలా లేవు.