బాబు, జగన్.. ఇద్దరికీ షాక్ ఇచ్చిన వర్మ !

ఇన్నాళ్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుని మాత్రమే టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకి ముందే ‘లక్ష్మీ ఎన్టీఆర్’ సినిమాని విడుదల చేయాలని ప్రయత్నించడం ఇందులో భాగమే అనుకొన్నారంతా. మరోవైపు, ఏపీ సీఎం వైఎస్ జగన్ పైన వర్మ పాజిటివ్ కార్నర్ ఉన్నట్టు కనబడింది. కానీ, తనకి ఇద్దరు ఒక్కటేనని తాజాగా వర్మ నిరూపించాడు. ఆయన తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. దీపావళీ కానుకగా ఈ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా ఘోర ఓటమి తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. అంతేకాదు.. ట్రైలర్ లో వైఎస్ జగన్ హత్యా రాజకీయాలని ఎంజరేజ్ చేసినట్టు చూపించారు. ఇక చిన్న బాబు లోకేశ్ ని ఒకటికి రెండు సార్లు ఏడిపించాడు. ఆయనకి ఉన్న పప్పు బిరుదుని గుర్తు చేశారు. ఏడుస్తూ భోజనం చేస్తున్న లోకేష్ కు పల్లెంలో బాబు పప్పు వడ్డించడం హైలైట్ గా నిలిచింది. 

ఇక పండగ పూట జనసేన, అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాస్త బాగానే చూపించాడు. ఇకపై ప్రశ్నించడం లేదు. పోరాటమే అని పవన్ గర్జించే బిట్ సీన్ చూపించాడు. ధనరాజ్, అలీ.. ఏబీఎన్ రాథాకృష్ణ పాత్రలని ఆసకికరంగా చూపించారు. ఓ బిట్ సీన్ లో రాథాకృష్ణ బాబుతో చిన్న బాబుని సీఎం చేయడం తనకి వదిలేయండీ అనడం చూడొచ్చు. మొత్తానికి.. దీపావళీ రోజున వర్మ.. ఇటు బాబు, అటు జగన్ ని ఏసుకొన్నాడని చెప్పుకోవాలి. కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ బాగా పేలింది. ఈ సినిమాకి విజయవాడ రౌడీయిజం నేపథ్యంగా తీసుకోవడం ఆకట్టుకొంది. మరోసారి.. బాబుకు వర్మ గట్టి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాడు.