శృతిహాసన్ మరోసారి బలుపు చూపిస్తోంది !


హీరోయిన్ శృతి హాసన్ మరోసారి ‘బలుపు’ చూపించబోతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ-శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం ‘బలుపు’. 2013లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు మరోసారి బలుపు కాంబో రిపీట్ కాబోతుంది. రవితేజ 66వ చిత్రం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకొన్నారు. దీనికి సంబంధించిన చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా చేసింది.

గత కొన్నాళ్లుగా శృతిహాసన్ కి తెలుగు సినిమా ఆఫర్లే లేవ్. ఆమె ఆస్ట్రేలియా ప్రియుడుతో బ్రేకప్ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీకావాలని ఆశపడుతున్నారు. ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడా ప్రయత్నాలు ఫలించి.. రవితేజ66 చిత్రంలో ఆఫర్ కొట్టేసింది శృతి. ఇక రవితేజ-గోపీచంద్ మలినేని కలయికలో వచ్చిన డాన్ శీను, బలుపు సినిమాలు ఆకట్టుకొన్నాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.