మెట్టు దిగిన మహేష్ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ దిగినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’, మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి సినిమాలు ఒకే రోజున జనవరి 12న రిలీజ్ డేటుని ప్రకటించుకొన్న సంగతి తెలిసిందే. దీంతో థియేటర్స్ సమస్య తలెత్తనుంది. అంతకంటే ముందు.. ఇది ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవకు దారితీస్తోంది. దాన్ని దృష్టిలో వుంచుకొని.. మహేశ్ ఓ మెట్టుదిగినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సినిమాల మధ్య కనీసం రెండ్రోజుల గ్యాప్ ఉండేలా చూసుకోవాలని మహేష్ అన్నారట. 

ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. జనవరి 11న ఒక సినిమా వస్తే.. జనవరి 13న మరో సినిమా రిలీజ్ చేస్తే బెటర్ అన్నట్టుగా డిస్కషన్స్ జరిగాయట. మరీ.. జనవరి 11న ఎవరు వస్తారు ? జనవరి 13న ఎవరెస్తారు ?? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక జనవరి 10న సూపర్ స్టార్ రజనీకాంత్ దర్భార్ రానుంది. ‘వెంకీమామ’కు సంక్రాంతి సీజన్ లో లో డేటు కావాలి. మొత్తానికి.. ఇప్పుడే చర్చలు మొదలయ్యాయ్. అవి ఫలిస్తే.. రెండ్రోజుల గ్యాప్ తో మూడ్నాలుగు సంక్రాంతి సినిమాలు క్యూ కట్టనున్నాయి.