వైరల్ : టికెట్స్ అమ్మిన విజయ్ దేవరకొండ


హీరో విజయ్ దేవరకొండ సినిమా టికెట్స్ అమ్మారు. ఆయన నిర్మాత మారి చేసిన చిత్రం ‘మీకు మాత్రమే చెప్తా’. కొత్త దర్శకుడు షమీ సుల్తాన్ దర్శకత్వం వహించారు. తరుణ్ భాస్కర్, వాణీ భోజనం, అభినవ్ గోమాటం, అనసూయ తదితరులు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాని తనదైన శైలిలో ప్రమోట్ చేసిన విజయ్ దేవరకొండ.. రిలీజ్ రోజున ఏకంగా టికెట్స్ కూడా అమ్మాడు.

ఇవాళ ఉదయం పూట షోకు సంబంధించి హైదరాబాద్ ప్రసాద్స్ హైమాక్స్ లో విజయ్ సినిమా టికెట్స్ అమ్మారు. అంతేకాదు.. టెకెట్స్ కొన్నవారికి పాప్ కార్న్, కూల్ డ్రింగ్స్ ని ఫ్రీగా అందజేశారు. ఇక, విజయ్ చేతుల మీదుగా మీకు మాత్రమే చెప్తా టికెట్స్ బాగానే తెగాయ్. టికెట్స్ ఇస్తున్న సమయంలో విజయ్ ని చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. తనదైన శైలిలో థియేటర్ వద్ద సందడి చేశారు విజయ్. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.