బాలీవుడ్ ‘జెర్సీ’ రిలీజ్ డేటు వచ్చేసింది !

మన సినిమాలు బాలీవుడ్ లో సత్తా చాటడమే కాదు. అక్కడ రిమేక్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయ్. టాలీవుడ్ సంచలనం ‘అర్జున్ రెడ్డి’ బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రిమేక్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో షాహిద్ కపూర్, కైరా అడ్వానీ జంటగా నటించారు. మాతృక దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో కైరా అద్వానీ బాలీవుడ్ లో బిజీ అయింది. సందీప్ వంగా పేరు బాలీవుడ్ లో మారుమ్రోగుతోంది. ఆయన తదుపరి సినిమా కూడా బాలీవుడ్ లోనే తెరకెక్కుతోంది. 

ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ సింగ్ నటించబోతున్నారు. ఇదో క్రైమ్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇక షాహిద్ కపూర్ మాత్రం మరోసారి తెలుగు సినిమానే నమ్ముకొన్నారు. జెర్సీ సినిమాని బాలీవుడ్ లో తెరకెక్కిస్తున్నారు. అక్కడ ఇదే టైటిల్ తో రానుంది. ఈ రిమేక్ కి మాతృక దర్శకుడు గౌతమ్ తిన్నమూరి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ లో జెర్సీ హీరోయిన్ గా రష్మిక మందనకి అవకాశం వచ్చింది. కానీ, బిజీ షెడ్యూల్ కారణంగా ఆమె సినిమా నుంచి తప్పుకొన్నట్టు సమాచారమ్. 

ఇక బాలీవుడ్ జెర్సీ కోసం షాహిద్ కపూర్ రెడీ అవుతున్నారు. బ్యాట్ పట్టీ మైదానంలోకి దిగారు. ప్రతిరోజు శిక్షణ తీసుకొంటున్నారు. తాజాగా షాహిద్ బ్యాట్ పట్టిన ఫోటోని చిత్రబృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతేకాదు.. వచ్చే యేడాది ఆగస్టు 28న సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి దిల్ రాజు, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. బాలీవుడ్ నిర్మాత ఆమన్ గిల్ సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ‘జెర్సీ’ సినిమా తండ్రీ-కొడుకుల సినిమా. దానికి ఎమోషన్స్ ని జతచేసి గౌతమ్ తిన్నమూరి అద్భుతంగా తెరకెక్కించారు. మరీ.. ఆ మేజిక్ బాలీవుడ్ లోనూ వర్కవుట్ అవుతుందేమో చూడాలి.