అభిమానిని సప్రైజ్ చేసిన ధోని !


టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆటోగ్రాఫ్‌ ఇవ్వమని ఓ అభిమానిని కోరగా.. అతడు కొత్తగాకొన్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పైనే ధోనీ సంతకం చేశాడు. ఆ సన్నివేశాన్ని ఓ వ్యక్తి వీడియోతీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోలో ధోనీ బైక్‌ ఫ్యుయల్‌ టాంక్‌పై సంతకం చేస్తుండగా అభిమాని సంతోషంగా కనిపించాడు.
ఇక వరల్డ్ కప్ తర్వాత ధోని మళ్లీ ఆడలేదు. ఆర్మీ ట్రైనింగ్ కోసమని రెండు నెలలు సెలవుల మీద వెళ్లాడు. తిరిగొచ్చాక అతడిని దక్షిణాఫ్రికా సిరీస్ కోసం ఎంపిక చేయలేదు. ఐతే, ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టు సందర్భంగా రాంచీలో టీమిండియా ఆటగాళ్లను కలిసిన సంగతి తెలిసిందే.