వారిది లవ్ స్టోరీ కాదు.. బలిపీఠం ?

నాగ చైతన్య-సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి లవ్ స్టోరీ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఇందులో చైతూ తెలంగాణ యువకుడి పాత్రలో, సాయి పల్లవి ఆంధ్రా అమ్మాయిగా నటిస్తున్నారు. అయితే వీరిద్దరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నప్పటికీ తెలంగాణ ఆంధ్రా ప్రాంతాల మధ్య ఉండే చిన్నచిన్న తేడాలతో.. అల్లుకొన్న కథాంశాన్ని  శేఖర్ కమ్ముల తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నారట. ఇప్పుడీ సినిమా గురించి ఆసక్తికర విషయం ఒకటి తెలిసింది. 

ఇది లవ్ స్టోరీ కాదు.. బలిపీఠం అంట.  1970 ప్రాంతాలలో వచ్చిన ‘బలిపీఠం’ సినిమా.. ముప్పాళ్ళ రంగనాయకమ్మ ‘బలిపీఠం’ నవల ఆధారంగా నిర్మింపబడింది. కులాంతర వివాహం చేసుకున్న ఇద్దరు భార్య భర్తలు ఆ తరువాత వారివారి కులాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలకు ఏర్పడ్డ భేదాభిప్రాయాల నేపథ్యంలో ఈ ఉంటుంది. ఇప్పుడు ఇంచుమించు అదే కథను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసి శేఖర్ కమ్ముల లవ్ స్టోరీగా మారుస్తున్నట్టు సమాచారమ్.