అఫిషియల్ : ‘పింక్’రిమేక్ తో పవన్ రీ-ఎంట్రీ

మెగా అభిమానులకి గుడ్ న్యూస్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఖాయమైంది. గత కొన్నాళ్లుగా పవన్ రీ-ఎంట్రీపై జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘పింక్’ రిమేక్ లో పవన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి బోనీ కపూర్ నిర్మించనున్నారు. యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు.
 
వాస్తవానికి పవన్ రీ ఎంట్రీ సినిమాకి ఏఎం రత్నం నిర్మాతగా ఉంటారని అందరు భావించారు. ఎందుకంటే ? ఏఎం రత్నంకి పవన్ ఓ సినిమా బాకీ పడ్డారు. . ‘అజ్ఝాతవాసి’ తర్వాత రత్నం కోసం సినిమా చేయాలని పవన్ ప్రయత్నించారు. కానీ, ఆ లోపే రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి కూడా ఏఎం రత్నం ఓ కారణమని చెబుతున్నారు. ఐతే, అనూహ్యంగా పవన్ రీ ఎంట్రీ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా మారారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.