టీడీపీ బీ-టీం కామెంట్స్ పై పవన్ రియాక్షన్ !

ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందుకు, తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీకి బీ-టీం అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీపై ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత ఎఫెక్ట్ జనసేపై పడింది. అందుకే ఆ పార్టీ ఒకే స్థానానికి పరితమైంది. పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారని విమర్శించారు. ఇటీవల ఇసుక కొరతపై పవన్ పోరాటం చేస్తున్న నేపథ్యంలోనూ మరోసారి పవన్ టీడీపీ బీ-టీం అంటూ వైసీపీ నేతలు మాటల జోరు పెంచారు. 

ఈ నేపథ్యంలో విశాఖ జనసేన లాంగ్ మార్చ్ లో.. టీడీపీ బీ-టీం కామెంట్స్ పై పవన్ స్పందించారు. తనను టీడీపీ బీ టీంగా వైసీపీ విమర్శలు చేస్తుందని.. తాను ప్రజలకు మాత్రమే బీ టీంగా ఉన్నానని స్పష్టం చేశారు. భీమవరం, గాజువాకలో ఓడిపోయినంత మాత్రం విఫలమైనట్లుగా కాదన్న పవన్ నాకు దక్కుతున్న ఆదరణ కంటే తనకు పదవులు ముఖ్యం కాదన్నారు.