ఢిల్లీ కాలుష్యంపై ప్రియాంక షాకింగ్ కామెంట్స్ 

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఢిల్లీ కాలుష్యంపై షాకింగ్ ట్విట్ చేశారు. ఢిల్లీలో సినిమా షూటింగ్ చేయడం చాలా కష్టంగా ఉందని ఆమె ట్విట్ చేశారు. ప్రియాంక తాజా చిత్రం ‘ది వైట్‌ టైగర్‌’.  ప్రముఖ రచయిత అరవింద్‌ అడిగా రచించిన ‘ది వైట్‌ టైగర్‌’ పుస్తకాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ దిల్లీలో ప్రారంభమైంది.ఆదివారం నుంచి ప్రియాంక ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

 ఢిల్లీ కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ప్రియాంక మాస్క్‌, కళ్లద్దాలు పెట్టుకుని సెట్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రాం వేదికగా ఆమె పోస్ట్‌ చేశారు. ‘వైట్‌ టైగర్‌’ షూటింగ్‌లో పాల్గొన్నాను. తాజా పరిస్థితుల వల్ల ఇక్కడ షూటింగ్‌ చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ కాలుష్యంలో ప్రజలు ఎలా ఉంటున్నారో తలచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి మనకి మాస్క్‌లు ఉన్నాయి కానీ ఇల్లు లేని చాలా మంది ప్రజలు రోడ్లు మీద నివసిస్తూ ఈ కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారి కోసం ప్రార్థించండి’ అని ప్రియాంక రాసుకొచ్చారు. ప్రియాంక పోస్ట్ పై నెటిజన్స్ మండిపడుతున్నారు.