‘పానిపట్’ ట్రైలర్ టాక్

1761లో జరిగిన మూడో పానిపట్టు యుద్ధం ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం ‘పానిపట్’. ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్‌ అశుతోష్‌ గోవారికర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్‌-అతుల్‌లు సంగీతం అందిస్తున్నారు. అశుతోష్‌ గోవారికర్‌ ప్రొడక్షన్స్‌, విజన్‌ వరల్డ్‌ ఫిల్మ్స్‌ ఈ చిత్రాన్ని సంయుక్తగా నిర్మిస్తున్నారు. డిసెంబర్‌ 6న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతోంది. ఇందులో సంజయ్ దత్ అహ్మద్‌ సా అబ్దాలీ పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ లోనే తన నటనతో అదరగొట్టేశాడు.  అర్జున్‌ కపూర్‌ మరాఠా నాయకుడు సదాశివరావ్‌ బాహు పాత్రలో, కృతీసనన్‌ పార్వతి బాయి పాత్రలో నటిస్తున్నారు. ట్రైలర్ బాగుంది. సినిమా కూడా ఈ రేంజ్ లో ఉంటే బ్లాక్ బస్టర్ హిట్టే.