నిరసన చేస్తున్నరెవెన్యూ ఉద్యోగులకి షాకిచ్చిన ఓ మహిళా.. !

అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు విధులకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. మంగళవారం బంద్ పాటించిన రెవెన్యూ ఉద్యోగులు, మరో రెండ్రోజులు బుధ, గురువారం కూడా విధులకి దూరంగా ఉంటామని ప్రకటించారు.

ఇందులో భాగంగా.. యాదాద్రి-భువనగిరి జిల్లా గుండాల MRO కార్యాలయం ముందు రెవిన్యూ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపే క్రమంలో వీఆర్వో లంచం తీసుకొని పాసు బుక్ ఇవ్వడం లేదని ఓ మహిళా నిలదీసింది. దీంతో అర్ధాంతరంగా ఉద్యోగులు నిరసన ముగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.