ప్రభాస్ ఇక రంగంలోకి దిగబోతున్నాడు !

‘సాహో’ తర్వాత ప్రభాస్ విరామం తీసుకొన్నాడు. ఇప్పుడా విరామం ముగిసింది. త్వరలోనే మళ్లీ షూటింగ్ తో బిజీ కానున్నారు. రాథాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం (జాన్-వర్కింగ్ టైటిల్) తదుపరి షెడ్యూల్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్లాన్ చేశారు. అక్కడ ఓ రైలు సెట్ వేశారు. సుమారు రెండు కోట్లకు పైగా ఖర్చుతో వేసిన రెండు రైలు పెట్టెల సెట్ ఇది. సినిమా అలనాటి కాలానికి చెందినది కాబట్టి, అప్పట్లో రైలు భోగీలు ఎలా వుండేవో ఆ విధంగా సెట్ వేశారు ఆర్ట్ డైరక్టర్ రవీందర్. ఈ సెట్ లో సుమారు 11 రోజులు షూటింగ్ వుంటుంది.

మరోవైపు, ‘జాన్’ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాపై విస్తృత చర్చ జరుగుతోంది. ప్రబాస్ కోసం సురేందర్ రెడ్డి, ప్రశాంత్ నీల్, పరశురామ్ రెడీగా ఉన్నారు. ఐతే, ప్రభాస్ తన తదుపరి సినిమాని బాలీవుడ్ లో చేసే ఎలా ఉంటది అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ముంబై బయలుదేరి వెళ్లారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ తో ప్రభాస్ సమావేశం కానున్నారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ప్రభాస్ కొత్త సినిమాపై ఓ క్లారిటీ రానుందని సమాచారమ్.