నయన్ ని మరోసారి మోసం చేసిన దర్శకుడు !


స్టార్ హీరోయిన్ నయనతార జీవితంలో ఒకటి కాదు రెండు సార్లు మోసం పోయింది. హీరో శింబుతో, ఆ తర్వాత నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో ప్రేమలో విఫలమైంది. ప్రేమ విషయం పక్కనపెడితే.. దర్శకుడు మురగదాస్ కారణంగా నయన్ రెండుసార్లు మోసపోయినట్టు తెలుస్తోంది. గతంలో ‘గజనీ’లో నయన్ చేసిన పాత్రపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ఆ చిత్రంలో దర్శకుడు తనకు చెప్పిన కథ వేరని, చిత్రంలో చూపించింది వేరని, తనను ఆ చిత్రంలో డమ్మీని చేశారని ఆరోపణలు చేసింది. తాను జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ‘గజని’ చిత్రంలో నటించడమేనని పలు సందర్భాల్లో చెప్పింది. గజనీ తర్వాత మురగదాస్ దర్శకత్వంలో నయన్ నటించిన చిత్రం ‘దర్భార్’. ఈ సినిమా విషయంలోనూ మురగదాస్ తనని మోసం చేశారని  నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన రెమ్యూనరేష్ ఆమెకి ఇంకా ఇవ్వలేదట. అదీకాకుండా.. సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యం ఉండదట. ముందుగా చెప్పిన కథ కంటే.. తనని బలహీనంగా చూపించారని నయన్ అంటోంది.

ఇటీవల ఎఫ్ ఎం రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు మురగదాస్ తనని మోసం చేసిన విధానంపై నయన్ మండిపడింది. అంతేకాదు.. తన ప్రేమ వ్యవహారాలపై స్పందించింది. ప్రస్తుతం మాత్రం ప్రియుడు విగ్నేష్ శివన్ తో హ్యాపీగా ఉన్నట్టు చెప్పింది. ప్రస్తుతం వీరిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. త్వరలోనే పెళ్లి చేసుబోతున్నట్టు వార్తలొస్తున్నాయ్. అదెప్పుడు? అనేది తెలియాలల్సి ఉంది.