కేసీఆర్ ఓ పిరికిపంద

కేసీఆర్ ఓ పిరికిపంద అని, ఆయ‌నకు ప్ర‌జాపోరాటాలంటే భ‌యం అని సీపీఐ జాతీయ నాయ‌కులు సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు. క‌రీంన‌గ‌ర్ లో జ‌రిగిన సీపీఐ పోరుబాట స‌భ సాక్షిగా ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వంపై విరుచుకు ప‌డ్డారు. ఒక్క టీఆర్ఎస్ పోరాటంతోనే తెలంగాణ రాలేద‌ని, అంద‌రి పోరాటాల‌తోనే రాష్ట్రం ఏర్ప‌డింద‌ని అన్నారు.

ద‌ళితుడిని ముఖ్య‌మంత్రిని చేస్తాన‌ని చెప్పి 63 సీట్లు గెలిచార‌ని,కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌న చెప్పాల‌ని అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్స‌హిస్తూ తాము తిన్న ఎంగిలికూడు నాకుతున్నార‌ని విమ‌ర్శించారు. డ‌బుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామ‌ని చెప్పిన కేసీఆర్ ఆయ‌న కోసం గ‌డీ మాత్రం క‌ట్టుకున్నార‌న్నారు. క‌రీంన‌గ‌ర్ లో జ‌రిగిన పోరుబాట స‌భ‌కు అఖిల‌ప‌క్ష నేత‌లు హాజ‌రై కేసీఆర్ ఏక‌ప‌క్ష వైఖ‌రిపై తీవ్ర స్థాయిలో విమ‌ర్శించారు.