పక్కా ఆధారాలతో.. బలమైన వాదనలు వినిపించండి !

ఆర్టీసీ వ్యవహారంపై సీఎం కేసీఆర్ వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం అందించిన ఆర్టీసీ నివేదికలపై హైకోర్టు అసంతృతిని వ్యక్తం చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్ లో దాదాపు నాలుగు గంటల పాటు సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం అవలంబించిన విధానాలపై హైకోర్టులో పక్కా ఆధారాలతో బలమైన వాదనలు వినిపించాలని సీఎం కేసీఆర్ అధికారులకు, అడ్వొకేట్ జనరల్ కు సూచించినట్లు తెలిసింది.

రూట్ పర్మిట్లకు అనుమతులను కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టం-2019 మేరకు నిర్ణయం తీసుకున్న విషయాన్ని వెల్లడించాలని ఆదేశించినట్లు సమాచారమ్. ఉమ్మడి ఆర్టీసీ విభజన, టీఎస్ ఆర్టీసీ ఏర్పాటు, ప్రభుత్వ సాయం, కార్మికుల సమ్మె, రూట్ పర్మిట్ల నేపథ్యం తదితర అంశాలను హైకోర్టుకు స్పష్టమైన నివేదిక అందించాలని సీఎం ఆదేశించినట్టు సమాచారమ్.