మహేష్, బన్నీ చర్చలు విఫలం !

టాలీవుడ్ సూపర్ స్టార్స్ మహేష్, అల్లు అర్జున్ అభిమానులని టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురంలో’,మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా ఒకే డేటు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు అగ్ర హీరోలు ఒకే రోజున వస్తే అది చూడటానికి బాగున్నా, ఆర్థికంగా రెండు సినిమాలకు నష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓ పెనింగ్స్ ను రెండు సినిమాలూ పంచుకోవాల్సి వస్తుంది. 

ఈ నేపథ్యంలో ఒక సినిమా ముందుకు.. మరో సినిమా ఒక రోజు వెనక్కి వెళ్తుందని ప్రచారం జరిగింది. జనవరి 11న మహేష్, జనవరి 13న బన్నీ సినిమా రావొచ్చనే ప్రచారం జరిగింది. ఐతే, అసలు విషయం ఏటంటే ? మహేష్ అసలు తగ్గడం లేదట. బన్నీ కూడా పట్టువిడవకపోవడంతో బిగ్ ఫైట్ తప్పేలా లేదు. ఐతే, సంక్రాంతికి మరో రెండు నెలలు ఉండటంతో అప్పటి వరకు ఎలాంటి మార్పులు జరుగుతాయో చూడాలి.