బాలీవుడ్ హీరోకు డెంగీ.. కండీషన్ సీరియస్ ?

దేశంలో విషజ్వరాలు ప్రభలుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరీ ఎక్కువ. డెంగీ జ్వరంతో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. డెంగీ దెబ్బకు సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు బాధితులుగా మిగిలిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెంగీ బారిన పడ్డాడు. యూరప్ ట్రిప్ ను ముగించుకుని వచ్చిన సుశాంత్ తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. 

 వైద్య పరీక్షలు చేయించుకుంటే.. డెంగీ సోకినట్టు తేలింది. ఈ నేపథ్యంలో తన అబుదాభి పర్యటనను సుశాంత్ రద్దు చేసుకున్నాడు. ఈ వారంలో ఓ కార్యక్రమం కోసం సుశాంత్ అబుదాభి వెళ్లాల్సి ఉంది. అనారోగ్య కారణాల వలన ఆ టూర్ ని సుశాంత్ రద్దు చేసుకొన్నారు. ముందుగా సుశాంత్ ఆరోగ్యం సీరియస్ గా అనిపించినా..  ఆయన క్రమ క్రమంగా కోలుకుంటున్నారు. 

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని బయోపిక్ తో సుశాంత్ తెలుగు ప్రేక్షకులని పలకరించిన సంగతి తెలిసిందే. అచ్చం ధోనిలా ఒదిగిపోయాడు. ధోని బయోపిక్ బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్స్ సాధించింది.