‘రామ్ చరణ్-ఎన్టీఆర్’ వర్సెస్ ‘మహేష్-బాలయ్య’

టాలీవుడ్’లో మల్టీస్టారర్ సినిమాల కోసం గట్టిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి ‘రామ్ చరణ్ – ఎన్టీఆర్’లతో ఓ మల్టీస్టారర్ ప్లాన్ చేశాడని చెబుతున్నారు. దీనికోసం ‘యమధీర’ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇదే నిజమైతే రాజమౌళి నుంచి రాబోతున్న మరో క్రేజీ ప్రాజెక్ట్.. ఈ మల్టీస్టారర్ కానుంది. ఇదీగాక, నితిన్-శర్వానంద్, నాగ్-నాని కలయికలో సినిమాలు రానున్నాయి.

మరోవైపు, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను మరో క్రేజీ మల్టీస్టారర్ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్టు సమాచారమ్. ఇటీవలే బోయపాటి ఓ కథని బాలయ్య, మహేష్ లకు వినిపించాడట. వీరిద్దరు సూచన ప్రాయంగా ఓకే చెప్పడంతో.. పూర్తి స్కిప్ట్ ని రెడీ చేసే పనిలో బోయపాటి ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్ర్కిప్ట్ రెడీ అయ్యింది. ఫైనల్’గా బాలయ్య, మహేష్ లు ఓకే చెబితే.. ఈ మల్టీస్టారర్ సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఓ వైపు, రామ్ చరణ్-ఎన్టీఆర్, మరోవైపు, బాలయ్య-మహేష్ బాబుల మల్టీస్టారర్స్ ఏకకాలంలో తెరకెక్కనున్నాయి. దీంతో ఇప్పటి నుంచే ‘రామ్ చరణ్-ఎన్టీఆర్’ వర్సెస్ ‘మహేష్-బాలయ్య’ అంటూ అభిమానులు లింకులు పెట్టేస్తున్నారు. మరీ.. ఈ రెండు మల్టీస్టారర్స్ సెట్స్ మీదకు వెళ్లే లోపు ఇంకెన్ని న్యూసులు, లీకులు వస్తాయో చూడాలి.