ఇస్మార్ట్ హీరోయిన్’తో గోవాలో పూరి.. ఎంజాయ్ !


దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఒకప్పుడు బ్యాంకాక్.. ఇప్పుడు గోవా ఫేవరేట్. ఏమాత్రం ఖాళీ దొరికిన అక్కడ వాలిపోతుంటాడు. పని ఉన్న అక్కడికే వెళ్తుంటాడు. అక్కడే కథ రాసుకొంటాడు. సినిమా షూటింగ్ కోసం అక్కడికే వెళ్తుంటాడు. ఇక ఖాళీ సమయాల్లో అక్కడికి వెళ్తే ఆయనకి తోడుగా హీరోయిన్ ఛార్మీ వెళ్తుంటుంది. ఈసారి ఆమెతో పాటు మరో హాట్ హీరోయిన్ కూడా వెళ్లింది. అమె ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్. నిధితో హిట్స్ ఖాతా తెరిపించిన క్రెడిట్ పూరిదే. 

సవ్యసాచి సినిమాతో నిధి అగర్వాల్ తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత మిస్టర్ మజ్ఝ్నులో మెరిసింది. ఈ రెండు ఫ్లాప్ కావడంతో టాలీవుడ్ లో నిధి పనైపోయింది అనుకొన్నారంతా. కానీ, ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. దీంతో ఆమెకి ఆఫర్లు పెరిగాయి. ప్రస్తుతం ఒకట్రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ ఆనందంలో నిధి కూడా గోవా చెక్కేసింది. అక్కడ దర్శకుడు పూరి, ఆయన బిజినెస్ పార్ట్ నర్ ఛార్మితో కలిసి ఎంజాయ్ చేసింది. దానికి సంబంధించిన ఓ పిక్ ని నిధి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఆదివారం ఇష్టమైన వారితో గోవా ఎంజాయ్ చేశానని కామెంట్ పెట్టింది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.