ఆర్టీసీకి ఎప్పుడూ నష్టాలు రాలేదట !

తెలంగాణ ఆర్టీసీ నష్టాల్లో ఉందని స్వయంగా ఆర్టీసీ కార్మికులే అంగీకరిస్తున్నారు. అందుకు భిన్నంగా అసలు ఆర్టీసీ ఎప్పుడూ నష్టాల్లో లేదని, ఆర్టీసీ ఆస్తులు బాగా పెరిగాయని అంటున్నాడు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. అప్పుడప్పుడు మాత్రమే మీడియా ముందుకు వచ్చే మందకృష్ణ.. ఈసారి ఆర్టీసీ సమ్మె వ్యవహారంపై బాగానే మాట్లాడారు.

ఆర్టీసీ ఆస్తులని సీఎం కేసీఆర్ కాజేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వరంగల్ లో మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. కార్మికుల సమ్మెను నిర్లక్ష్యం చేస్తూ, కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల్లోనే తప్పుడు నివేదికలు ఇచ్చిన ఉన్నతాధికారులు.. లేబర్ కోర్టులో నిజాలను చెబుతారా ? అని ప్రశ్నించారు. మందకృష్ణ మాట్లాడిన మిగితా మాటలు పక్కనపెడితే.. ఆర్టీసీ నష్టాల్లో ఎప్పుడూ లేదని అనడం.. ఆర్టీసీపై ఆయన అజ్ఝానికి నిదర్శణమని తెరాస శ్రేణులు అంటున్నాయి.