మహేష్, బన్నీలకు సూపర్ స్టార్ షాక్.. !

టాలీవుడ్ స్టార్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్’లకు సూపర్ స్టార్ రజనీకాంత్ సడెన్ షాకిచ్చాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ రోబో ‘#2.O’ని వచ్చే యేడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. దీంతో.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ లు ఆలోచనలో పడ్డారు. ఎందుకంటే.. ?

కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ “భరత్ అను నేను” సినిమాని వచ్చే యేడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేంది (ఏప్రిల్ 27) అప్పుడే. మహేష్, బన్నీ సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రావడమే పెద్ద యుద్ధంగా భావిస్తున్నారు. ఇప్పుడు వీరికి పోటీగా సూపర్ స్టార్ రజనీకాంత్ #2.Oతో వచ్చేస్తున్నాడు.

రజనీ ఎంట్రీతో మహేష్, బన్నీ సినిమాలు ముందుకు లేదా వెనక్కి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదని రజనీకి పోటీకి దిగితే జరగబోయే డ్యామేజ్ గురించి మహేష్, బన్నీలకు తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రోబో #2.O కోసం తెలుగు ప్రేక్షకులు అంతే ఆసక్తిని కనబరుస్తున్నారు. మొత్తానికి.. మహేష్, బన్నీలకు రజనీ సడెన్ షాక్ ఇచ్చాడనే చెప్పాలి.