ఏపీ: ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి 42ఏళ్లు..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు వరం ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ఎన్నో పోటీ ప‌రీక్ష‌లు రాసి చివ‌ర‌కు వ‌య‌సు స‌మ‌స్య‌తో ఉద్యోగాల‌ను పొంద‌లేని వారికి ఏపీ ప్ర‌భుత్వం తీపిక‌బురు వినిపించింది. ఏపీలో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌కు వ‌యోప‌రిమితి 42ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకుంది.

ఏపీపీఎస్సీతో పాటు ఇతర ప్ర‌భుత్వ ఉద్యోగాలకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్ర‌క‌టించింది. అయితే ఈ వ‌యోప‌రిమితి పెంపుకు ష‌ర‌తుల‌ను విధించింది. కేవ‌లం ఈ పెంపు నిర్ణ‌యం వ‌చ్చే ఏడాది అంటే 2018 సెప్టెంబ‌ర్ 30వ‌ర‌కు మాత్ర‌మే అమ‌లులో ఉంటుంద‌ట‌.