అఫిషియల్ : ‘అర్జున్ సురవరం’ గెస్ట్ గా మెగాస్టార్

యంగ్ హీరో నిఖిల్ సినిమా ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఈ ప్రచారం నిజమైంది. ఈ సాయంత్రం హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా హాజరుకాబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. ఈ సినిమాని ఇప్పటికే మెగాస్టార్ చూసేశారు. సినిమా నచ్చి ఫంక్షన్ కి వస్తానని చెప్పారట.

యూనివర్సల్ పాయింట్ తో ‘అర్జున్ సురవరం’ తెరకెక్కింది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ ఎదుర్కుంటున్న సమస్యను ఇందులో చూపించామని చిత్రబృందం చెబుతోంది. ఈ చిత్రానికి సంతోశ్ దర్శకత్వం వహించారు. నిఖిల్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. రాజ్ కుమార్ ఆకెళ్లతో కలిసి ఠాగూర్ మధు నిర్మించారు. ఈ వారమే (నవంబర్ 29) ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులని ఆకట్టుకొనే నిఖిల్ ఈ మధ్య కాస్త వెనబడినట్టు కనిపిస్తోంది. అర్జున్ సురవరంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత పెళ్లి వార్త కూడా చెబుతాడట.