కేసీఆర్ కేబినేట్ మీటింగ్ ప్రారంభం.. చర్చిస్తున్న అంశాలివే !

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఆర్టీసీ భవితవ్యం తేల్చే ఈ సమావేశం అత్యధిక ప్రాధాన్యతని సంతరించుకొంది. ఈ సమావేశంలో ప్రధానంగా ఆర్టీసీపై చర్చించనున్నారు.

* ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటే విధించాల్సిన షరతులపై చర్చించే అవకాశముంది

* ఆర్టీసీ సిబ్బంది తగ్గింపుపై పలు ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు

*  50 ఏళ్లు పైబడిన కార్మికులకు గోల్డెన్‌ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చే అవకాశం

* నిర్బంధ పదవీ విరమణ, ఆర్టీసీ ఆస్తుల అమ్మకంపై సాధ్యాసాధ్యాల పరిశీలించనున్నారు

* సగం రూట్లు ప్రైవేటుపరం చేయడం తదితర అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశముంది.