ఆ ఇద్దరే ప్రియాంకరెడ్డిని చంపారా ?

హైదరాబాద్ నగర పరిధిలోని షాద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. చటాన్ పల్లి వంతెన వద్ద ప్రియాంకరెడ్డి (22) అనే వెటర్నరి వైద్యురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ హత్యకేసుపై శంషాబాద్  డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పందించారు. బుధవారం సాయంత్రం ప్రియాంకరెడ్డి తన ఇంటి నుంచి గచ్చిబౌలి బయల్దేరారని చెప్పారు. 

శంషాబాద్  ఔటర్ రింఅగ్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆపి క్యాబ్ లో గచ్చిబౌలిలోని చర్మవ్యాధుల వైద్యుడి వద్దకు వెళ్లారని.. తిరిగి రాత్రి 9.30 గంటల సమయంలో శంషాబాద్  రింగ్ రోడ్డు వద్దకు చేరుకున్నారని డీసీపీ వివరించారు. అయితే ప్రియాంకరెడ్డి అక్కడికి చేరుకున్న సమయంలో తన ద్విచక్ర వాహనం పంక్చర్ అయిన విషయాన్ని గమనించారని తెలిపారు. 

ఈ విషయాన్ని తన సోదరికి ఆమె తెలియజేసిందని.. ఇద్దరు వ్యక్తులు పంక్చర్ వేయిస్తామన్నట్లు ఆమెతో ప్రియాంక తెలిపారన్నారు. పంక్చర్ వేయిస్తామన్న వ్యక్తులే ప్రియాంకను హత్య చేసి ఉంటారని తాము అనుమానిస్తున్నామని డీసీపీ చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామన్నారు.