అజిత్ పవార్ ఫైనల్ ట్విస్ట్.. ఏంటో తెలుసా ?

ఎన్సీపీ నేత అజిత్ పవార్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఎన్సీపీకి వెన్నుపోటు పొడిచి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అజిత్ పవార్.. అనేక ట్విస్టులు, ఫ్యామిలీ సెంటిమెంట్ల మధ్య తిరిగి సొంత గూటికి చేరుకొన్న సంగతి తెలిసిందే. మరి కొద్ది సేపటిలో ఉద్ధవ్ ధాక్రే కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయనుంది. అయితే ఆ జాబితాలో అజిత్ పవార్ పేరు లేదు. 

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా గురువారం తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేయట్లేదని అజిత్ పవార్ తెలిపారు. మహా వికాస్ అఘాడీ కూటమి తరపున సీఎంగా శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మూడు పార్టీల నుంచి మొత్తం ఆరుగురు సభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలిపారు. ఆ ఆరుగురిలో తాను లేనని.. డిప్యూటీ సీఎం పదవి గురించి పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. మరోవైపు, అజిత్ పవార్ అలకబూనారు. ఆయన తన ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ అందుబాటులోకి రాకుండా ఉండిపోయారనే ప్రచారం జరుగుతోంది.