అలియాని సాగనంపారు !

‘ఆర్ఆర్ఆర్’ నుంచి బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ని సాగనంపారు. అలాగని సినిమాలో నుంచి ఆమెని తీసేశారని కాదు. ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఆలియాకు సంబంధించిన పాత్ర చిత్రీకరణ పూర్తయ్యింది. దీంతో ఆమెకు చిత్రబృందం గ్రాండ్‌ సెండాఫ్‌ ఇచ్చి సంతోషంగా ముంబయికి పంపించారు. మళ్లీ సినిమా ప్రమోషన్స్ కోసం అలియా హైదరాబాద్ రానుంది.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జంటగా అలియాభట్ నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ కొమరం భీంగా, ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలీవియా నటిస్తున్నారు. ఇప్పటికే 70శాతం పైగా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఎన్టీఆర్‌ – ఒలీవియా మోరిస్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.  2020 జులై 30న ఆర్ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.