ప్రియాంకరెడ్డి హత్యకేసులో ఐదో నిందితుడు ఎవరు ?


హైదరాబాద్ నగర పరిధిలోని షాద్ నగర్ లో ప్రియాంకరెడ్డి (22) అనే వెటర్నరి డాక్టర్ ని నలుగురు కిరాతకులు అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యచేసి తగలబెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై యావత్ దేశాన్ని కలవరానికి గురిచేసింది. ఈ కేసులో నలుగురు నిందితులని శుక్రవారం పోలీసులు మీడియా ముందు హాజరుపరిచారు. వారి ఫోటోలని మీడియాకు విడుదల చేశారు. వీరిలో ఇద్దరు లారీ డ్రైవర్లు కాగా, మరో ఇద్దరు క్లీనర్స్ అని పోలీసులు తెలిపారు. ఐతే, ఈ కేసులో 5వ నిందితుడు కూడా ఉన్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. దాంతో అతడు ఎవరు ? అతడిని పోలీసులు ఎందుకు దాచి పెట్టారు? అనే అనుమానాలు తలెత్తున్నాయ్. 

తాజాగా ఈ ప్రచారంపై శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి స్పందించారు. ఐదో నిందితుడు ఉన్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. తాము కోర్టుకి అన్ని ఆధారాలు సమర్పించి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. దీంతో ప్రియాంకరెడ్డి హత్యకేసులో ఐదో నిందితుడు లేడని విషయం స్పష్టమైంది. మరీ.. ఐదో నిందితుడు ఉన్నాడంటూ ప్రచారం ఎలా మొదలైంది అన్నది అర్థంకావడం లేదు.