బాలయ్య, తేజు.. దొంగ పోటీ !

తెలుగు చిత్రాలకి డబ్బింగ్ తమిళ చిత్రాలు గట్టిపోటీ ఇస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న అల.. , సరిలేరు చిత్రాలకి సూపర్ స్టార్ రజనీకాంత్ దర్భార్ నుంచి గట్టిపోటీ ఉండనుంది. రజనీ సినిమా ఏమాత్రం బాగున్నా.. స్టయిట్ తెలుగు సినిమా రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇక కోలీవుడ్ యంగ్ హీరో కార్తీకి తెలుగులో మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన ‘ఖైదీ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నారు. ఆయన ఇప్పుడు ‘దొంగ’గా మారిన సంగతి తెలిసిందే. 

కార్తీ, ఆయన వదిన జ్యోతిక కీలక పాత్రల్లో నటించిన తమిళ చిత్రం ‘తంబి’. తెలుగులో ‘దొంగ’గా తీసుకొస్తున్నారు. ఈ చిత్రానికి జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించారు. వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ ప్రొడక్షన్‌ నిర్మించాయి. డిసెంబర్ 20న దొంగ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ రోజు బాలయ్య ‘రూలర్’, సాయి తేజు ‘ప్రతిరోజూ పండగే’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య, తేజులకి దొంగ నుంచి గట్టి పోటీ తప్పేలే లేదు. అసలే ‘ఖైదీ’హిట్ తో కార్తీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు.