ధైర్యమే నా ఖడ్గం : పవన్ 

ధైర్యమే నా ఖడ్గం. ఆ ధైర్యంతోనే సామజంలో మార్పు రావాలని కోరుకుంటున్నా. మార్పు రావాలని కోరుకునే వారికి ధైర్యం ఉంటుందన్నారు జనసేన అధినేత, పవర్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌ తిరుపతిలో పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడిన పవన్.. ప్రభుత్వ తప్పిదాలపై పోరాడదామన్నారు.

ఇటీవల కర్నూలులో జరిగిన ఓ అత్యాచార ఘటనను ప్రస్తావించిన పవన్.. ఆడబిడ్డల్ని కాపాడలేకపోతే 151 సీట్లు వచ్చి ఏం లాభం? అన్నారు. రేపిస్టులను తోలు ఊడే వరకు కొట్టాలి. దిశ కేసులో నిందితుల్ని చంపేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారన్నారు. తప్పు చేసిన వారికి సింగపూర్‌ తరహా శిక్షలు ఉండాలన్నారు. శబరిమల వివాదంపై స్పందించిన పవన్.. సంప్రదాయాన్ని అందరూ గౌరవించాలన్నారు.