విలన్ గా ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ !

బాహుబలి సినిమాతో బాలీవుడ్ లోనూ క్రేజ్ సంపాందించుకొన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. వాస్తవానికి బాహుబలి తర్వాత ప్రభాస్ స్టయిట్ హిందీ సినిమా చేస్తారనే ప్రచారం జరిగింది. ఐతే, అప్పటికి యువ దర్శకుడు సుజీత్ కి ఇచ్చిన మాట ప్రకారం సాహో సినిమా చేశాడు ప్రభాస్. భారీ బడ్జెత్ తో తెరకెక్కిన ‘సాహో’ ప్లాప్ టాక్ తెచ్చుకొంది. అయినా.. ప్రభాస్ క్రేజ్ తో బాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు సమాచారమ్.

ధూమ్-4 కోసం చాన్నాళ్ల క్రిందటే దర్శకుడు ఆదిత్య చోప్రా ప్రభాస్ ని అడిగాడట. ఆ ఆఫర్ ని ప్రభాస్ సున్నితంగా తిరస్కరించారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో వచ్చిన వార్, సాహో చిత్రాలకి మంచి ఆదరణ లభించడంతో ధూమ్-4 తీసుకురావాలనే ప్రయత్నాలు మళ్లీ మొదలెట్టాడు ఆదిత్య చోప్రా. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ప్రభాస్ ని కలిసినట్టు సమాచారమ్. ప్రభాస్ ఓకే చెబితే.. ధూమ్-4లో ప్రభాస్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ధూమ్ సిరీస్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ సిరీస్ తో ప్రభాస్ బాలీవుడ్  కి పరిచయం అయితే.. అంతకంటే ఏం కావాలి. మరీ.. డార్లింగ్ బాలీవుడ్ స్టయిలీష్ విలన్ అనిపించుకుంటాడేమో చూడాలి.