పాపం.. ‘ఫిదా’ రేణుక మోసపోయింది

శేఖర్ కమ్ముల ‘ఫిదా’ సినిమాతో హీరోయిన్ సాయి పల్లవి (భానుమతి)తో పాటు.. ఆమె అక్క గాయత్రి (రేణుక) కూడా ఫేమస్ అయిపోయింది. సినిమాలో ఆమె పేరుతో వచ్చిన ‘పిల్లా రేణుక పిలగాడొచ్చిండే.. ‘ సాంగ్ సూపర్ డూపర్ హిట్. ఐతే, పర్సనల్ లో లైఫ్ లో మాత్రం రేణుక (గాయత్రి)కి కష్టాలు ఎక్కువేనట. ఇప్పటి వరకు చాలాసార్లు ప్రేమలో మోసపోయిందట. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో తన ఎఫైర్స్ ముచ్చట్లని చెప్పింది గాయత్రి.

‘ఇప్పటికే తాను ఎంతోమందిని ప్రేమించా. ఆపై మోసపోయి వారికి దూరంగా ఉన్నా. తాజాగా, తన జీవితంలోకి ప్రవేశించిన దర్శకుడు ప్రణీత్’తో కూడా విడిపోయా. అయితే, ఈ లవ్ బ్రేకప్ తనను ఎంతో బాధించింది. తన జీవితం నుంచి అతను వెళ్లిపోవడం బాధాకరం’ అని చెప్పుకొచ్చింది. ఐతే, తరచూ ప్రేమలో విఫలమయినా.. తనకి మాత్రం అబ్బాయిలతో స్నేహం చేయడమే ఇష్టమంటోంది’ రేణుక.. అదేనండీ గాయత్రి.