మెట్రో పిల్ల‌ర్ క్రాక్ ప్ర‌చారంపై క్లారిటీ ఇచ్చిన ఎండీ

హైదరాబాద్ లో ఐఎస్బి గచ్చిబౌలి రూట్ లో మెట్రో పిల్లర్ క్రాక్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో జ‌రుగుతున్నప్ర‌చారం అస‌త్య‌మ‌ని, హైద‌రాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. అసలు ఆ రూట్లో మెట్రో పిల్లర్లు గానీ, మెట్రో లైన్ గానీ ఏవీ లేవ‌న్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పోస్టు పై గతంలోనే మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారని చెప్పారు.

సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న ప్ర‌చారంలో ఉన్న ఫోటోలు పెషావర్ లోని మెట్రో పిల్లర్ వి అని, హైదరాబాద్ ది కాదని స్ప‌ష్టం చేశారు. మన మెట్రో పిల్లర్లు వేల టన్నుల బరువును, భూకంపాలను సైతం తట్టుకునే విధంగా అత్యంత నాణ్యత తో పాటు ఆకర్షణీయంగా నిర్మించామ‌న్నారు.హైదరాబాద్ మెట్రోకు వస్తున్న ఆదరణను చూసి కొందరు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు.