‘సూర్యుడివో.. చంద్రుడివో..’ అదిరిపోయింది !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సూర్యుడివో.. చంద్రుడివో.. ‘ లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్రబృందం. రామజోగయ్య శాస్త్రి రాసిని ఈ పాటను బీ ప్రాక్ పాడాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

పాట అద్భుతంగా ఉంది. ఈ పాటలో మహేష్, విజయశాంతిలపై చిత్రీకరించరించారు. తాజాగా విడుదల చేసిన లిరికల్ సాంగ్ లోనూ వారిపై మేకింగ్ బిట్స్ సీన్స్, ఫోటోస్ జతచేశారు. దాంతో సాంగ్ కలర్ ఫుల్ గా కనబడుతోంది. సంక్రాంతి బరిలో ఉన్న త్రివిక్రమ్-అల్లు అర్జున్ ల ‘అల.. వైకుంఠపురంలో’ సాంగ్స్ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన సరిలేరు సాంగ్ సూర్యుడివో.. చంద్రుడివో..  ఆ రేంజ్ లోనే ఉంది. ఈ పాట కూడా అల.. సాంగ్ రేంజ్ కి వెళ్లేలా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. మేజర్ అజయ్ కృష్ణకి విజయశాంతి కుటుంబానికి లింకు ఏంటీ ? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సింది. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న సరిలేరు ప్రేక్షకుల ముందుకు రానుంది. కథ-కథనం గ్రిప్పింగ్ నడపడంతో పాటు సినిమాని వినోదాత్మకంగా తీర్చిదిద్దడం దర్శకుడు అనిల్ రావిపూడి ప్రత్యేకత. సరిలేరు కూడా ఆ కొలతల్లోనే ఉండనుందని చెబుతున్నారు.