బాలయ్య సినిమా.. భయపెడుతున్న బడ్జెట్ !

బాలయ్య-బోయపాటి సినిమా మైత్రీ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కాల్సింది. ఇప్పుడీ సినిమా చేతులు మారి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా మారారు. ఇంతకీ బాలయ్య సినిమాని మైత్రీ మూవీస్ ఎందుకు తప్పుకున్నట్టు ? అంటే.. బడ్జెట్ సమస్య అని తెలిసింది. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 70కోట్ల బడ్జెట్ ఖర్చు కానుందట.

ఈ సినిమా కోసం బాలయ్యకు రూ. 10 కోట్ల పారితోషికం ఫిక్సయింది. ఆయన కంటే ఐదు కోట్లు ఎక్కువగా అంటే రూ. 15కోట్ల పారితోషికం దర్శకుడు బోయపాటి శ్రీను తీసుకోనున్నాడు. హీరోయిన్, మ్యూజిక్ డైరక్టర్, సినిమాటోగ్రాఫర్, ఇంకా కీలక టెక్నీషియన్లు, ఇతర స్టార్ కాస్ట్ కలిసి మరో ఏడెనిమి కోట్ల వరకు అవుతోంది. ఫైనల్ గా సినిమా బడ్జెట్ ని రూ. 70కోట్లుగా అంచనా వేశారు. అంత బడ్జెట్ ని బాలయ్యకి తిరిగి తీసుకురాగల సత్తా ఉందా.. ?

ఈ అనుమానాలతోనే ఈ ప్రాజెక్ట్ నుంచి మైత్రీ మూవీస్ పక్కకు జరిగినట్టు ఫిల్మ్ నగర్ సమాచారమ్. బాలయ్య-బోయపాటిలది హిట్ కాంబో. వీరి కాంబోలో వచ్చిన సింహా, లయన్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే వీరి హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య సినిమా అనే సరికి బోయపాటి మంచి కథ-కథనాలు రాసుకోవడంతో పాటు.. భారీ డైలాగ్స్, యాక్షన్ అదిరిపోయే ఉండేలా చూసుకొంటాడు. ఆ ధైర్యంతోనే మిరియాల రవీందర్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. మరీ.. ఆయన నమ్మకాన్ని బోయపాటి నిలబెడుతాడేమో చూడాలి.