జగన్’కు లోకేష్ సన్నబియ్యం కౌంటర్

తెదేపా యువనేత నారా లోకేష్ ని ప్రత్యర్థి పార్టీ నేతలు పప్పు.. పప్పు అంటూ సటైర్స్ వేస్తున్న సంగతి తెలిసిందే. ఐతే, ఆయన కూడా రుజువులతో సహా కౌంటర్ ఇవ్వగలడని తాజాగా నిరూపించాడు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సన్నబియ్యం పంపిణీ సీఎం జగన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. తాము సన్నబియ్యం ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పలేదని.. నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే చెప్పామని జగన్ అన్నారు. మరీ.. సాక్షి పేపర్లో ఈ మేరకు రాశారు కదా..? అంటే.. సాక్షి పేపర్ తప్పుగా రాసిందని సీఎం జగన్ సభాముఖంగా అన్నారు.

ఇప్పుడీ వ్యాఖ్యలు తెదేపా నేతలకి అస్త్రాలుగా మారాయి. సాక్షి పేపర్ దొంగ పేపర్. అందులో రాసేవి అన్నీ అబద్ధాలేనని తాజాగా లోకేష్ ట్విట్ చేశారు. దాంతో పాటు.. గతంలో జగన్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. ప్రజలకి సన్నబియ్యం, నాణ్యమైన బియ్యాని సరఫరా చేస్తామని చెబుతున్న మాటలతో ఓ వీడియోని వదిలారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ.. ఈ వీడియోపై రేపు అసెంబ్లీ సీఎం జగన్ ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి.