అమెరికాలో మళ్లీ కాల్పులు.. 6గురు మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకులు శబ్ధం వినిపించింది. న్యూజెర్సీ రాష్ట్రంలోని జెర్సీ నగరంలోని నిత్యావసర సరకుల దుకాణంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఓ ట్రక్కులో ఘటనా స్థలికి వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో అనేక మంది దుకాణంలో చిక్కుకుని వెళ్లారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు, ఇద్దరు అనుమానిత నిందితులు సహా ఓ పోలీసు ఉన్నతాధికారి మృతి చెందారు.

పోలీసులు-ముష్కరుల మధ్య గంటలపాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. దీన్ని ఓ భయంకరమైన ఘటనగా అభివర్ణించిన ఆయన.. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. కావాల్సిన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు.