బ్రేకింగ్ : చినబాబుకి తప్పిన పెద్ద ప్రమాదం

తెదేపా యువ నేత నారా లోకేష్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏపీలో ఆర్టీసీ ఛార్జీల పెంపునకి నిరసనగా తెదేపా ఆందోళన చేపట్టింది. తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ఎమ్మెల్యే ర్యాలీగా అసెంబ్లీకి చేరుకొన్నారు. అసెంబ్లీ వద్ద నిరసన చేపట్టారు. ఇక మంగళగిరి బస్టాండ్ వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో నారా లోకేష్ పాల్గొన్నారు.

అక్కడి నుంచి సిటీ బస్ ఎక్కి అసెంబ్లీకి చేరుకొన్నారు. సిటీ బస్ దిగి.. లోకేశ్‌, టీడీపీ ఎమ్మెల్సీలు పాదయాత్రగా అసెంబ్లీకి వస్తుండగా డ్రోన్‌ కెమెరా ఒక్కసారిగా కిందపడింది. విద్యుత్‌ తీగలు తగలడంతో డ్రోన్‌ కెమెరా రోడ్డుపై పడిపోయింది. ఎమ్మెల్సీలకు సమీపంలో డ్రోన్‌ పడడంతో నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. రోడ్డుపై పాదయాత్ర చేస్తున్న నేతలకు పక్కన డ్రోన్‌ పడడంతో ప్రమాదం తప్పినట్లయింది. అదే నేతలపై పడివుంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదేమో.. ! అందుకే.. చిన్నబాబుకి పెద్ద ప్రమాదం తప్పిందని తెదేపా శ్రేణులు చెప్పుకొంటున్నాయి.