@ప‌వ‌న్: అందుకే జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేదు

 

విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు చేశారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన మంచి ప‌నులున్నాయి, అలాగే ఆయ‌న చేసిన అవినీతి కూడా ఉంద‌ని అన్నారు ప‌వ‌న్. వైఎస్ చ‌నిపోగానే సీఎం కావాల‌నుకోవ‌డం జ‌గ‌న్ అవివేక‌మ‌ని ఆయ‌న అన్నారు. వార‌సులు ఎవ‌రైనా త‌మ ప్ర‌తిభ నిరూపించుకుని రాజ‌కీయాల్లోకి రావాల‌ని చెప్పారు.

కానీ జ‌గ‌న్ అలా చేయ‌లేద‌ని, తండ్రి వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకోవ‌డంతో పాటు, వార‌త‌స‌త్వంగా సీఎం కావాల‌నుకున్నాడ‌ని చెప్పారు ప‌వ‌న్. అందుకే సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు మ‌ద్ద‌తు ఇవ్వ‌లేద‌ని ఆయ‌న తెల్చిచెప్పారు. తాను స‌ర‌దా కోసం పార్టీ పెట్ట‌లేద‌ని, ప్ర‌జా స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించ‌డానికే ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చాన‌ని ఆయ‌న తెలిపారు.