‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ రెండో ట్రైలర్ చూశారా ?

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏమాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’ గురువారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిక్సిడ్ టాక్ అందుకుంది. ఐతే, సినిమాలోని కొన్ని పొలిటికల్ సటైర్స్, కామెడీ సీన్స్ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఏపీ రాజకీయ నేతలని వర్మ భలే అచ్చుగుద్దాడ్రా అని చెప్పుకొంటున్నారు. ఈ హడావుడి ముగియకముందే.. వర్మ మరో సినిమాపై ఫోకస్ పెట్టాడు.

వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా  ‘ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌’. బ్రూస్‌లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. భారత్‌లో రామ్ గోపాల్ వర్మ నిర్మిస్తున్న తొలి మార్షల్ ఆర్ట్ సినిమా ఇది. ఇందులో హీరోయిన్ గా పూజా బాలేకర్ నటిస్తోంది.  హీరో అంటూ ఎవరూ లేదు.  పూజానే హీరో, హీరోయిన్. తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ ని వదిలారు. ట్రైలర్ లో యాక్షన్ అదిరిపోయింది. అదే సమయంలో రొమాన్స్ ని చూపించాడు. ఆ ట్రైలర్ ని మీరు చూసేయండీ.. !