ఢిల్లీలో మరో భారీ అగ్నిప్రమాదం

పశ్చిమ ఢిల్లిలోని ముండ్కా ప్రాంతంలో ఉన్న ఓ ఓ ప్లైవుడ్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకొన్న మంటలు ఎదురుగా ఉన్న బల్బుల పరిశ్రమకు సైతం వ్యాపించాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత ఎక్కువైంది. 21 ఫైరింజన్లతో మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఏలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. గత ఆదివారం జరిగిన అనాజ్ మండీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 43 మంది దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద అగ్నిప్రమాదంగా అధికారులు తెలిపారు.