చరణ్’తో విసిగిపోయిన రాజమౌళి.. ఏం చేశాడంటే ?

రెండు పడవల ప్రయాణం ఎప్పుడూ ప్రమాదమే అంటుంటారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గత కొన్నాళ్లుగా రెండు పడవల ప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం.150’తో చరణ్ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే చరణ్ ‘ధృవ’ సినిమా చేశారు.

‘ఖైదీ నెం.150’ నిర్మాణ బాధ్యతలన్నీ దర్శకుడు వివి. వినాయక్ చూసుకొన్నారని చెబుతుంటారు. ఇక ‘రంగస్థలం’ సినిమా చేస్తూనే.. ‘సైరా’ సినిమాని నిర్మించాడు రామ్ చరణ్. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉంటూనే చిరు 152 సినిమా నిర్మాణ పనులు చూసుకుంటున్నారు రామ్ చరణ్. దీంతో.. ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కి ఇబ్బంది కలుగుతుంది. చరణ్ కారణంగా ఒకట్రెండు సార్లు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ వాయిదా పడినట్టు సమాచారమ్.

చరణ్ వలన కలిగే ఇబ్బందిని నిర్మాత డివివి దానయ్యకి చెప్పే ధైర్యం లేదు. ఈ నేపథ్యంలో స్వయంగా దర్శకధీరుడు రాజమౌళి రంగంలోకి దిగారట. కొన్ని రోజులు నిర్మాత బాధ్యతలని పక్కకు పెట్టాలని సూచించాడట. రెండు పడవల ప్రయాణం ఇబ్బందని వివరించారట. ఈ నేపథ్యంలోనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న మెగాస్టార్ సినిమా బాధ్యతలని నుంచి చరణ్ తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆ సినిమా నిర్మాణ పూర్తి బాధ్యతలని సహా భాగస్వామిగా ఉన్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ అందుకుందని ఫిల్మ్ నగర్ సమాచారమ్.